ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మమతా బెనర్జీ ఆశలపై లోక్ సభ ప్రారంభమైన కొద్ది సేపటికే చల్లారిపోయాయి. అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ మీరా కుమార్కు నోటీసు ఇచ్చింది. అయితే ఇందుకు కావలసిన 50 మంది సభ్యుల మద్దతును కూడగట్టడంలో తృణమూల్ విఫలం కావడంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించలేమని ప్రకటించారు.గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ అంశం లోక్ సభలో ప్రస్తావనకు వచ్చింది. స్పీకర్ మీరాకుమార్కు తృణమూల్ కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. అప్పటికే సభలో విదేశీ పెట్టుబడుల గురించి పెక్కుమంది సభ్యులు తమ అభిప్రాయాలను రకరకాలుగా వ్యక్తం చేస్తుండడంతో సభలో ఏం జరుగుతున్నదీ ఎవరికీ వినిపించలేదు. ఈ సమయంలో తృణమూల్ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. స్పీకర్ సరేనంటూ ఈ తీర్మానం ప్రతిపాదనను ఎంత మంది సమర్ధిస్తున్నారో లేచి నిల్చోవలసిందిగా కోరారు.
తృణమూల్ కాంగ్రెస్ సభ్యులతో పాటు ఇద్దరు ముగ్గురు బె.జె.డి. సభ్యులు కూడా మద్దతు పలికారు గాని తీర్మానం ప్రతిపాదనకు కావలసిన 50 మంది సభ్యుల మద్దతును మాత్రం తృణమూల్ సాధించలేకపోయింది. ఆ సమయంలో సభ్యులు రకరకాల అంశాలపై నినాదాలు చేస్తుండడంతో స్పీకర్ మీరాకుమార్ ప్లీజ్ ప్లీజ్ గొడవ చేయవద్దు అని పదే పదే సభ్యులకు విజ్ఞప్తి చేయవలసివచ్చింది. ఆమె నవ్వుతూనే మందలించినా పరిస్థితి ప్రశాంతంగా మారడానికి కొంత సమయం పట్టింది. సభ్యులు ఎంత మంది ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్నారని స్పీకర్ పదే పదే అడగగా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్య చెప్పారు. అయితే అంతా కలిపి పాతిక మంది కూడా లేకపోవడం సభలో స్పష్టంగా కనిపించడంతో తగినంత సంఖ్యాబలం ఈ ప్రతిపాదనకు లేకపోవడంవల్ల ప్రతిపాదననే త్రోసిపుచ్చుతున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more